గరికపాటి ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: యూటీఎఫ్
ABN , Publish Date - Mar 25 , 2026 | 05:01 AM
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై చేసిన వ్యాఖ్యలను ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు తక్షణమే ఉపసంహరించుకోవాలని యూటీఎఫ్...
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై చేసిన వ్యాఖ్యలను ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు తక్షణమే ఉపసంహరించుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పిల్లలకు రెండు పూటలా భోజనం పెట్టలేని స్థితిలో పేద కుటుంబాలు ఉన్నందునే మధ్యాహ్న భోజనం పథకం అమలవుతోందనే విషయాన్ని గరికపాటి తెలుసుకోవాలన్నారు.