నిరంతరాయ విద్యుత
ABN , Publish Date - May 06 , 2026 | 12:24 AM
నిరంతరాయంగా విద్యుత సరఫరా చేయాని కర్నూలు ఆపరేషన సర్కిల్ ఎస్ఈ ప్రదీప్కుమార్ అధికారులను ఆదేశించారు.
వేసవిలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించండి
కర్నూలు ఎస్ఈ ప్రదీప్కుమార్
కల్లూరు, మే 5 (ఆంధ్రజ్యోతి) : నిరంతరాయంగా విద్యుత సరఫరా చేయాని కర్నూలు ఆపరేషన సర్కిల్ ఎస్ఈ ప్రదీప్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం విద్యుతభవనలోని సమావేశ మందిరంలో ఆయన కర్నూలు టౌన డివిజన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ విద్యుత శాఖ అధికారులు వినియోగదారులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలన్నారు. విద్యుత అంతరాయాలను తగ్గించి నాణ్యమైన విద్యుత అందించాలని, ట్రాన్సఫార్మర్ల వైఫల్యాలను తగ్గించాలన్నారు. వినియోగదారులకు పీఎం సూర్యఘర్ కింద సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి వారు విద్యుతబిల్లును తగ్గించుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ముఖ్యంగా భద్రతా ప్రమాణాలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఈ, ఏడీఈ, ఏఈలు, అకౌంట్స్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.