Share News

ప్రసాదాల నాణ్యతే లక్ష్యం

ABN , Publish Date - Jun 16 , 2026 | 04:01 AM

శ్రీవారి ప్రసాదాల తయారీ, నాణ్యత పరీక్షల్లో శాస్త్రీయ విధానాల అమలుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ర్టియల్‌ రిసెర్చ్‌....

ప్రసాదాల నాణ్యతే లక్ష్యం

  • పలు సంస్థలతో టీటీడీ అవగాహన ఒప్పందం

తిరుపతి(టీటీడీ), జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి ప్రసాదాల తయారీ, నాణ్యత పరీక్షల్లో శాస్త్రీయ విధానాల అమలుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ర్టియల్‌ రిసెర్చ్‌ (సీఎస్ఐఆర్‌)-సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎఫ్టీఆర్‌ఐ)మైసూర్‌ మధ్య సోమవారం బెంగళూరులో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా శ్రీవారి ప్రసాదాలు, టీటీడీ ఆహార పదార్థాల్లో నాణ్యత, పోషక విలువలు మెరుగుపరచనున్నారు.

ఒప్పందంలో ముఖ్యాంశాలు..

  • ముడి పదార్థాల కొనుగోలు, ఆహార తయారీ, పంపిణీ ప్రక్రియల్లో నాణ్యత ప్రమాణాలు, ప్రామాణిక కార్యాచరణ విధానాలు, పర్యవేక్షణ వ్యవస్థలను టీటీడీ-సీఎఫ్టీఆర్‌ఐ బృందాలు రూపొందించి, అమలు చేస్తాయి.

  • ఫ నిల్వ, నాణ్యత పరీక్షలు, ముడి పదార్థాల కొనుగోలు వ్యవస్థల ఆధునికీకరణకు సీఎ్‌ఫటీఆర్‌ఐ సాంకేతిక సలహాలు అందిస్తుంది. కలుషిత ప్రమాదాలను తగ్గించి, నాణ్యతలో స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది.

  • ప్రసాదాల అసలైన రుచి, నాణ్యత, సాంస్కృతిక విలువలకు భంగం కలుగకుండా వాటి నిల్వ కాలాన్ని పెంచేందుకు పరిశోధన ఆధారిత ప్యాకేజింగ్‌ విధానాలు అభివృద్ధి చేస్తారు.

  • టీటీడీ ఆహార విశ్లేషకులు, ఆహార నిర్వహణ సిబ్బందికి ఆధునిక విశ్లేషణ పద్ధతులు, నమూనాల సేకరణ విధానాలు, కలుషిత పదార్థాల గుర్తింపు, నెయ్యి స్వచ్ఛత పరీక్షలు, సుగంధ లక్షణాల విశ్లేషణపై శిక్షణ ఇస్తారు.

  • సీఎఫ్టీఆర్‌ఐకు చెందిన సీనియర్‌ శాస్త్రవేత్తలు టీటీడీ ఆహార తయారీ నిల్వ కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శించి అమలు ప్రక్రియలు, ధ్రువీకరణ అధ్యయనాలు, నిల్వ/కొనుగోలు ప్రణాళికల మెరుగుదలకు మార్గనిర్దేశం చేస్తారు.

Updated Date - Jun 16 , 2026 | 04:01 AM