Share News

10, 11 తేదీల్లో టీటీడీ ఇంజనీరింగ్‌ పోస్టులకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు

ABN , Publish Date - Apr 26 , 2026 | 06:25 AM

టీటీడీ ఇంజనీరింగ్‌ విభాగంలో పోస్టుల భర్తీ కోసం మే 10, 11 తేదీల్లో ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ)ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు.

10, 11 తేదీల్లో టీటీడీ ఇంజనీరింగ్‌ పోస్టులకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు

తిరుపతి(టీటీడీ), ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ఇంజనీరింగ్‌ విభాగంలో పోస్టుల భర్తీ కోసం మే 10, 11 తేదీల్లో ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ)ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షల ద్వారా ఏఈఈ (సివిల్‌), ఏఈఈ (ఎలక్ర్టికల్‌), ఏఈ (సివిల్‌), ఏటీవో (సివిల్‌) పోస్టులను భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. హాల్‌ టికెట్లు, పరీక్ష కేంద్రాలు, ఇతర వివరాలకు టీటీడీ వెబ్‌సైట్‌ https: //ttdrecruitment.aponline.in/TTD Recruitment/Views/Dash board.aspx, 155257 కాల్‌సెంటర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.

Updated Date - Apr 26 , 2026 | 06:27 AM