9 నెలల్లో 3 పోర్టులు సిద్ధం: జనార్దన్రెడ్డి
ABN , Publish Date - Mar 06 , 2026 | 04:07 AM
నిర్మాణంలో ఉన్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులు 6 నుంచి 9నెలల్లోపు కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని పోర్టుల...
ఇంటర్నెట్ డెస్క్: నిర్మాణంలో ఉన్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులు 6 నుంచి 9నెలల్లోపు కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని పోర్టుల అభివృద్ధి శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి చెప్పారు. ఈ పోర్టులతో రైలు, రోడ్డు అనుసంధానానికి అవసరమైన భూమి, నిర్మాణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం, మారిటైం బోర్డు సమకూరుస్తున్నాయని తెలిపారు. గురువారం శాసనమండలిలో టీడీపీ సభ్యుల ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.