సీఎస్ కమిటీలోకి మరో ముగ్గురు సభ్యులు
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:07 AM
ఉద్యోగుల ఆరోగ్య పథకంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సీఎస్ నేతృత్వంలో నియమించిన కమిటీలో మరో ముగ్గురికి స్థానం కల్పించింది
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగుల ఆరోగ్య పథకంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సీఎస్ నేతృత్వంలో నియమించిన కమిటీలో మరో ముగ్గురికి స్థానం కల్పించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ సెక్రటరీ సౌరభ్ గౌర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కమిటీలోకి ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి.రామకృష్ణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పిఎస్ఎస్ఎన్పీ శాస్త్రిలకు సభ్యులుగా అవకాశం కల్పించింది.