Share News

డీఎస్‌జీగా బాధ్యతలు స్వీకరించిన నిరంజన్‌

ABN , Publish Date - May 14 , 2026 | 05:47 AM

కేంద్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌(డీఎస్‌జీ)గా నియమితులైన న్యాయవాది తేనేపల్లి...

డీఎస్‌జీగా బాధ్యతలు స్వీకరించిన నిరంజన్‌

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌(డీఎస్‌జీ)గా నియమితులైన న్యాయవాది తేనేపల్లి నిరంజన్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించా రు. హైకోర్టు ప్రాంగణంలోని డీఎస్‌జీ కార్యాలయంలో జరిగిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి అదనపు సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ) చల్లా ధనంజయ, కేంద్ర ప్రభుత్వ కౌన్సిళ్లు, సీబీఐ తరఫు న్యాయవాదులు పాల్గొన్నారు. డీఎ్‌సజీ నిరంజన్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.

Updated Date - May 14 , 2026 | 05:47 AM