రూ.3 కోట్లతో కానూరు-లంకలకోడేరు రోడ్డు
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:30 AM
పశ్చిమగోదావరి జి ల్లా తణుకు పట్టణంలో ప్రధా న ఆర్అండ్బీ రహదారి అరు ున కానూరు-లంకలకోడేరు రోడ్డు నిర్మాణానికి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శంకుస్థాపన చేశారు.
నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి
‘అక్షరం అండగా..పరిష్కారమే అజెండాగా’ లో గుర్తించిన సమస్యకు పరిష్కారం
తణుకు, జూన్ 6(ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో ప్రధాన ఆర్అండ్బీ రహదారి అయన కానూరు-లంకలకోడేరు రోడ్డు నిర్మాణానికి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శంకుస్థాపన చేశారు. రూ.3కోట్లతో నిర్మించే ఈ రహదారి నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. తణుకు పైడిపర్రు చెర్వుగట్టు సమీపంలో మార్చి 30న ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా-పరిష్కారమే అజెండా’గా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కానూరు- లంకల కోడేరు రోడ్డు సమస్యను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అతి త్వరలోనే రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇందు లో భాగంగానే రోడ్డు నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ.60కోట్లతో రోడ్లు పునర్నిర్మాణం చేశామన్నారు. మున్సిపల్ కమిషనర్ టి.రామ్కుమార్. డీఈఈ కె.ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.