16 నుంచి ఒంటిపూట బడులు
ABN , Publish Date - Mar 14 , 2026 | 04:38 AM
ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనునట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనునట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు తెలిపారు. ఉదయం 7.45 నుంచి మధ్యా హ్నం 12.30 వరకు తరగతులు నిర్వహించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాలు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తాయని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలవుతుందన్నారు.