సిలికానాంధ్ర ఆధ్వర్యంలో శతక శంఖారావం
ABN , Publish Date - Mar 16 , 2026 | 05:55 AM
సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకల్లో భాగంగా అమెరికా గడ్డపై తెలుగు పద్యాలతో తొలిసారిగా గిన్నీస్ రికార్డు నెలకొల్పే యత్నానికి రూపకల్పన జరిగింది.
అమెరికాలో తెలుగు పద్యాలతో గిన్నీస్ రికార్డుకు యత్నం
ఆగస్టు 8న కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ ఎరీనాలో కార్యక్రమం
మార్చి 31లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సిలికానాంధ్ర పిలుపు
(డల్లాస్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకల్లో భాగంగా అమెరికా గడ్డపై తెలుగు పద్యాలతో తొలిసారిగా గిన్నీస్ రికార్డు నెలకొల్పే యత్నానికి రూపకల్పన జరిగింది. ఆగస్ట్ 8వ తేదీన కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ ఎరీనాలో శతక శంఖారావం పేరిట ఈ కార్యక్రమం నిర్వహిస్తామని సిలికానాంధ్ర సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. వేమన శతకం నుంచి 9, సుమతీ శతకం నుంచి 9 పద్యాలతో 1800మంది ప్రవాస బాలబాలికలు, యువతీయువకులు, పెద్దలు ఈ శంఖారావంలో పాల్గొని గిన్నీస్ రికార్డుకు యత్నిస్తారని చెప్పారు. మార్చి 31లోగా silerjubilee.silicnandhra.org/registration ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు. గిన్నీస్ సంస్థ ప్రతినిధులు ఈ కార్యక్రమ పర్యవేక్షకులుగా హాజరవుతారని, పాల్గొనే ప్రతి ఒక్కరికీ గిన్నీస్ సంస్థ నుంచి సర్టిఫికెట్ లభిస్తుందని ఆనంద్ తెలిపారు. ఈ సర్టిఫికెట్ ద్వారా కాలేజీ ప్రవేశాలకు స్వల్ప ప్రాధాన్యత లభిస్తుందని వెల్లడించారు. పద్యాల ఆడియో ఫైల్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయన్నారు.