సర్వర్ డౌన..
ABN , Publish Date - Sep 09 , 2026 | 01:19 AM
కర్నూలు జీజీహెచలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఓపీ రోగులకు అవస్థలు తప్పడం లేదు.
కర్నూలు జీజీహెచలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఓపీ రోగులకు అవస్థలు తప్పడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం సర్వర్ డౌన కావడంతో ఉదయం 9:30 గంటల నుంచి ఓపీల కోసం రోగులు క్యూ కట్టారు. సాఫ్ట్వేర్ అప్లోడు, పాస్వర్డ్ మార్పు కారణంగా సర్వర్ డౌన కావడంతో ఓపీ కౌంటర్లలో ఇబ్బందులు తలెత్తాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సిబ్బంది చేతిరాతతో ఓపీ చీటీలు రాయించి రోగులకు అందజేశారు. చేతి రాతతో ఓపీలు ఇవ్వంతో రోగులు గంటల తరబడి క్యూలైనలలో నిలబడలేక ఇబ్బందులు పడ్డారు. ఒక దశలో ఉదయం 10:30 గంటలకు రోగుల క్యూలైన రోడ్డెక్కింది. రోగుల రద్దీ ఉన్న సమయంలో ఆసుపత్రి అధికారులు పర్యవేక్షణ చేసి సమస్యను పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.
- కర్నూలు హాస్పిటల్ (ఆంధ్రజ్యోతి):