‘పొదుపు మాట- అభివృద్ధికి బాట’
ABN , Publish Date - May 19 , 2026 | 06:08 AM
‘మోదీజీ పొదుపు మాట - దేశ అభివృద్ధికి బాట’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ సందేశాన్ని సైకత శిల్పంగా మలిచారు తూర్పుగోదావరి జిల్లా, రంగంపేటకు చెందిన కళాకారుడు దేవిన శ్రీనివాస్.
ప్రధాని మోదీ సందేశంతో సైకత శిల్పం
‘మోదీజీ పొదుపు మాట - దేశ అభివృద్ధికి బాట’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ సందేశాన్ని సైకత శిల్పంగా మలిచారు తూర్పుగోదావరి జిల్లా, రంగంపేటకు చెందిన కళాకారుడు దేవిన శ్రీనివాస్. ‘బచత్ కరో, దేశ్ బడాయే’ అనే నినాదంతో ఆయన సోమవారం ఆ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఇంధనం పొదుపు చేయాలని, బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, విదేశీ ప్రయాణాలను నియంత్రించాలని, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలంటూ ఆయన ఆ శిల్పంపై తీర్చిదిద్దిన సందేశం స్థానికులను ఆలోచింపజేస్తోంది.
- (రంగంపేట-ఆంధ్రజ్యోతి)