Pig competitions: తాడిపత్రిలో పందుల పోటీలు
ABN , Publish Date - Jan 15 , 2026 | 04:23 AM
సంక్రాంతి వేడుకల్లో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో బుధవారం పందుల పోటీలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో...
సంక్రాంతి వేడుకల్లో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో బుధవారం పందుల పోటీలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోనిజూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ఈ పోటీలను తిలకించేందుకు జనం ఆసక్తిగా తరలివచ్చారు. ఈ పోటీలో పాల్గొన్న పందుల యజమానులకు రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10వేలు చొప్పున నగదు బహుమతులను అందజేశామని నిర్వాహకులు తెలిపారు.
- తాడిపత్రి-ఆంధ్రజ్యోతి