షాపులకు శాశ్వత రిజిస్ట్రేషన్
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:28 AM
రాష్ట్రంలోని షాపులు, కమర్షియల్ సంస్థలకు శాశ్వత రిజిస్ట్రేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కార్మిక శాఖ మార్గదర్శకాలు జారీ
అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని షాపులు, కమర్షియల్ సంస్థలకు శాశ్వత రిజిస్ట్రేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని షాపులు, కమర్షియల్ సంస్థలు 24 గంటలూ వ్యాపారాలు చేసుకోవచ్చునని తెలిపారు.