కొనసాగుతున్న పదోన్నతి పరీక్షలు
ABN , Publish Date - Apr 08 , 2026 | 11:13 PM
స్థానిక జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో ఎస్ఐ పదోన్నతి ఎంపిక పరీక్షలు బుధవారం కూడా కొనసాగాయి. ఈ ఎంపిక పరీక్షలను ఐజీ, అనంతపురం రేంజ్ ఇనచార్జి డీఐజీ షిమోషీ, ఎస్పీ విక్రాంత పాటిల్, ఏపీఎస్పీ రెండో బెటాలియన కమాండెంట్ దీపిక పాటిల్ పరిశీలించారు.
పరిశీలించిన ఐజీ షిమోషీ
కర్నూలు క్రైం, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): స్థానిక జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో ఎస్ఐ పదోన్నతి ఎంపిక పరీక్షలు బుధవారం కూడా కొనసాగాయి. ఈ ఎంపిక పరీక్షలను ఐజీ, అనంతపురం రేంజ్ ఇనచార్జి డీఐజీ షిమోషీ, ఎస్పీ విక్రాంత పాటిల్, ఏపీఎస్పీ రెండో బెటాలియన కమాండెంట్ దీపిక పాటిల్ పరిశీలించారు. రాయలసీమ జోన పరిదిలోని 72 మంది ఏఎస్ఐలకు అవుట్డోర్ పరీక్షలు నిర్వహించారు. డ్రిల్, ఆయుధాలపై పరిజ్ఞానం, నేరస్థుల పరిశీలన, మౌఖిక పరీక్షలు చేశారు.అడిషినల్ ఎస్పీ హుశేనపీరా, డీటీసీ డీఎస్పీ దుర్గాప్రసాద్, డీఎస్పీలు శ్రీనివాసులు, కరీమ్, సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.