25, 26న విచారణకు రండి!
ABN , Publish Date - Feb 21 , 2026 | 05:03 AM
తమ పదవులకు రాజీనామా చేసిన ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలను విచారణకు హాజరుకావాలంటూ మండలి చైర్మన్ మోషేన్ రాజు నోటీసులు జారీ చేశారు.
రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ నోటీసులు
తమ పదవులకు రాజీనామా చేసిన ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలను విచారణకు హాజరుకావాలంటూ మండలి చైర్మన్ మోషేన్ రాజు నోటీసులు జారీ చేశారు. ఈమేరకు శుక్రవారం ఇచ్చిన నోటీసుల్లో 25, 26న విచారణకు రావాలని పేర్కొన్నారు. 25న జయమంగళం వెంకటరమణను, 26న కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్ను విచారణకు రావాలని మండలి చైర్మన్ నోటీసుల్లో కోరారు.