విద్యార్థుల ‘నో డ్రగ్స్’ ప్రచారం
ABN , Publish Date - Jan 31 , 2026 | 05:47 AM
డ్రగ్స్పై దండయాత్ర పేరుతో ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్లోని మహిళా పోలీసులు నిర్వహిస్తున్న....
డ్రగ్స్పై దండయాత్ర పేరుతో ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్లోని మహిళా పోలీసులు నిర్వహిస్తున్న సైకిల్ యాత్రకు ఎనికేపాడులో విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ‘నో డ్రగ్స్’ అక్షరాకృతిలో నిలబడి మహిళా పోలీసులకు మద్దతు పలికారు. 510 కిలోమీటర్లు సాగే ఈ సైకిల్ యాత్రలో అన్ని విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
- విజయవాడ, ఆంధ్రజ్యోతి