ఉక్కు భూముల్లో రూ.2,977 కోట్లతో స్టాక్ యార్డు
ABN , Publish Date - Jun 21 , 2026 | 05:25 AM
విశాఖపట్నం స్టీల్ప్లాంటు భూముల్లో ‘నేషనల్ మినరల్ డెవల్పమెంట్ కార్పొరేషన్’ (ఎన్ఎండీసీ) ఐరన్ ఓర్ బ్లెండింగ్ ప్లాంటును ఏర్పాటుచేయనుంది.
విశాఖపట్నం, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్ప్లాంటు భూముల్లో ‘నేషనల్ మినరల్ డెవల్పమెంట్ కార్పొరేషన్’ (ఎన్ఎండీసీ) ఐరన్ ఓర్ బ్లెండింగ్ ప్లాంటును ఏర్పాటుచేయనుంది. బఫర్ స్టాక్ యార్డుగా పేర్కొంటున్న దీని నిర్మాణ బాధ్యతలను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్)కు శనివారం అప్పగించింది. ప్రాజెక్టు వ్యయం రూ.2,977 కోట్లు. దీని కోసం స్టీల్ ప్లాంటు నుంచి1,167 ఎకరాలను ఎన్ఎండీసీ 33 ఏళ్ల లీజుకు తీసుకుంది.