సమయం పెంచినా సరిపోలేదు
ABN , Publish Date - Jun 22 , 2026 | 06:12 AM
ఈసారి నీట్ యూజీ పునః పరీక్షలో కఠినంగానే ఉంది గోసలైట్స్ విద్యాసంస్థల ఎండీ నరేంద్రబాబు తెలిపారు.
‘గోసలైట్స్’ ఎండీ నరేంద్రబాబు
విజయవాడ, జూన్ 21(ఆంధ్రజ్యోతి): ఈసారి నీట్ యూజీ పునః పరీక్షలో కఠినంగానే ఉంది గోసలైట్స్ విద్యాసంస్థల ఎండీ నరేంద్రబాబు తెలిపారు. ‘‘బోటనీ, జువాలజీ పేపర్లు సులభంగా ఉన్నాయి. కెమిస్ర్టీ మధ్యస్తంగా ఉన్నా.. ఫిజిక్స్ కఠినంగా ఉంది. మొత్తంగా పేపర్ కఠినంగానే ఉందని చెప్పాలి. ఈసారి సమయాన్ని 15 నిమిషాలు పెంచినా.. ప్రశ్నల కఠినత్వాన్ని బట్టి ఈ సమయం సరిపోదు. పిల్లల్లో సృజనాత్మకత ఉంటేనే బాగా రాయగలరు. కేవలం పుస్తకాలపైన ఆధారపడితే ఇబ్బందే.’’ అని చెప్పారు.