Share News

Visakhapatnam: 28, 29 తేదీల్లో విశాఖలో జైళ్ల శాఖ జాతీయ సదస్సు

ABN , Publish Date - Jan 20 , 2026 | 04:28 AM

జైళ్ల శాఖ తొమ్మిదో జాతీయ సదస్సును ఈ నెల 28, 29 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్నట్టు విశాఖ కేంద్ర కారాగారం ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌...

Visakhapatnam: 28, 29 తేదీల్లో విశాఖలో జైళ్ల శాఖ జాతీయ సదస్సు

విశాఖపట్నం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): జైళ్ల శాఖ తొమ్మిదో జాతీయ సదస్సును ఈ నెల 28, 29 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్నట్టు విశాఖ కేంద్ర కారాగారం ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌, సదస్సు నోడల్‌ అధికారి ఎం.మహే్‌షబాబు తెలిపారు. భీమిలి బీచ్‌ రోడ్డులో రుషికొండ వద్ద గల సాయిప్రియ రిసార్ట్స్‌లో జరిగే ఈ సదస్సుకు కేంద్ర పాలిత ప్రాంతాలు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన జైళ్ల శాఖ డీజీపీలు, ఐజీ స్థాయి అధికారులు హాజరవుతారన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో జైళ్ల శాఖలో రాష్ట్రాలవారీగా అమలుచేస్తున్న సంస్కరణలు, విధానాలతోపాటు సవాళ్లపై చర్చిస్తారని తెలిపారు. సదస్సు ప్రారంభానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌, ముగింపు సదస్సుకు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథులుగా హాజరవుతారని వెల్లడించారు.

Updated Date - Jan 20 , 2026 | 04:28 AM