Share News

మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయను

ABN , Publish Date - May 23 , 2026 | 06:16 AM

జీడీనెల్లూరు ఎమ్మెల్యే థామస్‌ శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు.

మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయను

  • టీడీపీ అధిష్ఠానం ఎదుట ఎమ్మెల్యే థామస్‌ వివరణ

అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): జీడీనెల్లూరు ఎమ్మెల్యే థామస్‌ శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. దళిత ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మట్టి అక్రమ రవాణాతోసహా ఏ చిన్న ఘటన జరిగినా హైలెట్‌ చేస్తారని, అదే అగ్రవర్ణ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఏం జరిగినా వాటిపై ఏం మాట్లాడరంటూ థామస్‌ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్‌ అయింది. ఈ వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం సీరియస్‌ అయింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివా్‌సను కలిసిన థామస్‌... తాను చేసిన వ్యాఖ్యలపె వివరణ ఇచ్చారు. కావాలనే కొందరు తన మాటలను వక్రీకరించారని, ఇకపై ఎవ్వరు రెచ్చగొట్టినా అలాంటి వ్యాఖ్యలు చేయబోనని తెలిపారు.

Updated Date - May 23 , 2026 | 06:16 AM