250 కోట్ల భూమిని దోచుకున్నారు
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:52 AM
గత ప్రభుత్వ హయాంలో రాజమహేంద్రవరంలో రూ.250 కోట్ల విలువచేసే భూమిని దోచుకున్నారని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆరోపించారు.
నాటి కలెక్టర్ మాధవీలతపై విచారణ జరపాలి: ఎమ్మెల్యే గోరంట్ల
రాజమహేంద్రవరం రూరల్, మార్చి 17(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో రాజమహేంద్రవరంలో రూ.250 కోట్ల విలువచేసే భూమిని దోచుకున్నారని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆరోపించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం ఆయనమాట్లాడారు. ‘గత ప్రభుత్వం హయాంలో జిల్లాలో జరిగిన భూ అక్రమాలపై విచారణ జరపాలి. ఆ క్రమంలో అప్పటి జిల్లా కలెక్టర్ మాధవీలతను కూడా విచారించాల్సిన అవసరం ఉంది.’ అని ఎమ్మెల్యే గోరంట్ల అన్నారు.