Share News

Minister Nimmala Rama Naidu: రేపు ఆత్మార్పణ దినం

ABN , Publish Date - Jan 19 , 2026 | 04:22 AM

మాఘ శుద్ధ విధియ నాడు రాష్ట్ర పండుగగా నిర్వహించే ‘ఆత్మార్పణ దినం’ సందర్భంగా ప్రభుత్వం తరఫున మంత్రి నిమ్మల రామానాయుడు...

Minister Nimmala Rama Naidu: రేపు ఆత్మార్పణ దినం

  • ప్రభుత్వం తరఫున కన్యకాపరమేశ్వరి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి నిమ్మల రామానాయుడు

అమరావతి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): మాఘ శుద్ధ విధియ నాడు రాష్ట్ర పండుగగా నిర్వహించే ‘ఆత్మార్పణ దినం’ సందర్భంగా ప్రభుత్వం తరఫున మంత్రి నిమ్మల రామానాయుడు శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించునున్నారు. ఈ మేరకు దేవదాయ శాఖ ఎక్స్‌అఫిషియో సెక్రటరీ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో ఉన్న శ్రీ నాగేశ్వర స్వామి, మహిశాసురమర్దిని, శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 20వ తేదీన ఆత్మార్పణ దినంగా ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు దావోస్‌కు వెళ్లిన నేపథ్యంలో ఆయన స్థానంలో మంత్రి నిమ్మల ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని దేవదాయ శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - Jan 19 , 2026 | 04:25 AM