ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని మా నినాదం
ABN , Publish Date - Mar 28 , 2026 | 04:39 AM
ఒకే రాష్ట్రం ఒకే రాజధాని తమ నినాదమని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమని తెలిపారు.
అమరావతిపై మీ వైఖరి ఏమిటి జే టర్న్ జగన్ గారూ?: లోకేశ్
అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ఒకే రాష్ట్రం ఒకే రాజధాని తమ నినాదమని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమని తెలిపారు. ‘అమరావతిపై మీ స్టాండ్ ఏమిటని జే టర్న్ జగన్ గారూ?’ అని ఎక్స్లో ప్రశ్నించారు. వివిధ సందర్భాల్లో జగన్ అమరావతికి మద్దతుగా మాట్లాడిన వీడియో క్లిప్పులను తన పోస్టుకు జత చేసి.. శనివారం అసెంబ్లీకి వచ్చి అవే అంశాలను చెప్పవచ్చు కదా అని లోకేశ్ సూచించారు.