Share News

డబ్ల్యూఈఎఫ్‌ గవర్నమెంట్‌ ఎఫైర్స్‌ హెడ్‌తో భేటీ

ABN , Publish Date - Jan 23 , 2026 | 05:11 AM

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం గవర్నమెంట్‌ ఎఫైర్స్‌ హెడ్‌ మరూస్‌ బైౖరౌజ్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు.

డబ్ల్యూఈఎఫ్‌ గవర్నమెంట్‌ ఎఫైర్స్‌ హెడ్‌తో భేటీ

ఇంటర్నెట్ డెస్క్: వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం గవర్నమెంట్‌ ఎఫైర్స్‌ హెడ్‌ మరూస్‌ బైౖరౌజ్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. ఏడాదిలోగా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం-ఏపీ సీ4 ఐఆర్‌ (సెంటర్‌ ఫర్‌ ఫోర్త్‌ ఇండస్ట్రియల్‌ రివల్యూషన్‌)ను కార్యాచరణలోకి తీసుకురావడానికి అవసరమైన విధివిధానాలపై చర్చించారు. మంత్రి లోకేశ్‌ ప్రతిపాదనలపై మరూస్‌ సానుకూలంగా స్పందించారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం-ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ ఎనర్జీ అండ్‌ సైబర్‌ రెసిలెన్స్‌ను స్థాపించేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. డబ్ల్యూఈఎఫ్‌ ఆధ్వర్యంలో సీ4 ఐఆర్‌లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు సాధ్యమైనంత త్వరగా ఏపీలో డబ్ల్యూఈఎఫ్‌ సీ4 ఐఆర్‌ను స్థాపిస్తామని వెల్లడించారు.

Updated Date - Jan 23 , 2026 | 05:12 AM