క్రెడిట్ చోరీకి కేరాఫ్ అడ్రస్ వైసీపీ
ABN , Publish Date - May 18 , 2026 | 05:04 AM
వైసీపీని ప్రజలు తిరస్కరించినా ఆ పార్టీ నేతలు భోగాపురం ఎయిర్పోర్టు, శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు తమ క్రెడిట్గా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీకి కేరాఫ్..
ప్రజలు తిరస్కరించినా మారని తీరు: మంత్రి కొండపల్లి
విజయనగరం, మే 17(ఆంధ్రజ్యోతి): వైసీపీని ప్రజలు తిరస్కరించినా ఆ పార్టీ నేతలు భోగాపురం ఎయిర్పోర్టు, శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు తమ క్రెడిట్గా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీకి కేరాఫ్ అడ్ర్సగా ఉన్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. విజయనగరం జిల్లా గజపతినగరం టీడీపీ కార్యాలయంలో ఆదివారం ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి అనంతరం విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు.