Share News

మెగా డీఎస్సీపై జగన్‌ ఆరోపణలు అర్థరహితం

ABN , Publish Date - Jun 01 , 2026 | 06:20 AM

మెగా డీఎస్సీపై జగన్‌ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. డైవర్షన్‌ రాజకీయాలు ఆయన నైజమని విమర్శించారు.

మెగా డీఎస్సీపై జగన్‌ ఆరోపణలు అర్థరహితం

  • డైవర్షన్‌ రాజకీయాలు ఆయన నైజం: మంత్రి కొల్లు

ఒంగోలు కార్పొరేషన్‌, మే 31(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీపై జగన్‌ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. డైవర్షన్‌ రాజకీయాలు ఆయన నైజమని విమర్శించారు. ఆదివారం ఒంగోలులో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ అమలు చేయకుండా నిరుద్యోగులను దగా చేసిన జగన్‌... ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. యువత, నిరుద్యోగులను రోడ్డున పడేయడమే లక్ష్యంగా కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ పీఏ అవినీతి బాగోతం బయటికి వస్తుండటంతో డీఎస్సీపై అసత్య ప్రచారం ప్రారంభించారని, పీఏనే అలా ఉంటే ఇక నాయకుడి అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.

Updated Date - Jun 01 , 2026 | 06:21 AM