ఫైబర్ నెట్తో మెరుగైన సేవలు: జనార్దనరెడ్డి
ABN , Publish Date - Mar 29 , 2026 | 04:03 AM
అధునాతన సాంకేతిక నైపుణ్యంతో కూడిన మెరుగైన ఫైబర్నెట్ సేవలను ప్రజలకు అందిస్తామని మంత్రి బీసీ జనార్దనరెడ్డి చెప్పారు.
అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): అధునాతన సాంకేతిక నైపుణ్యంతో కూడిన మెరుగైన ఫైబర్నెట్ సేవలను ప్రజలకు అందిస్తామని మంత్రి బీసీ జనార్దనరెడ్డి చెప్పారు. సచాలయంలో శనివారం ఐఅండ్ఐ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఫైబర్నెట్ ఎండీ గీతాంజలి శర్మ ఆధ్వరంలో కేబుల్ నెట్ నిర్వాహకులతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్దిష్ట గడువు ముగిసిన ఫైబర్ పీపీఈ బాక్సుల అద్దెలు ఏప్రిల్ 1 నుంచి తగ్గిస్తున్నామని ప్రకటించారు.