రాష్ట్రంపై కక్షతోనే జగన్ మావిగన్ పాట
ABN , Publish Date - Jul 02 , 2026 | 03:52 AM
రాష్ట్రం మీద, ప్రజల మీద ద్వేషం పెంచుకున్న జగన్ పూటకో మాట మాట్లాడుతున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు.
పరిశ్రమలు రాకూడదనే క్రిమినల్ అజెండా: మంత్రి గొట్టిపాటి
అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం మీద, ప్రజల మీద ద్వేషం పెంచుకున్న జగన్ పూటకో మాట మాట్లాడుతున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. అందులో భాగంగానే మొన్న మూడు రాజధానులు, నేడు మావిగన్ అంటూ నినాదాలు చేస్తున్నారని అన్నారు. ‘రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదనే క్రిమినల్ అజెండాతో జగన్ పని చేస్తున్నాడు. మూడు రాజధానుల పిచ్చి సిద్ధాంతమే గొడ్డలి పార్టీకి 11 సీట్లు ఇచ్చింది. మావిగన్ సిద్ధాంతంతో ఇక సింగిల్ డిజిట్ ఖాయం’ అని మంత్రి రవికుమార్ విమర్శించారు.