Share News

‘జైల్‌ భరో’ను జయప్రదం చేయాలి

ABN , Publish Date - Aug 09 , 2026 | 11:35 PM

కార్మికులు, కర్షకులు, రైతాంగం ఎ దుర్కొంటున్న సమ స్యలను పరిష్కరిం చాలని నేడు చేపట్టి న జైల్‌భరో కార్యక్ర మాన్ని జయప్రదం చే యాలని ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

‘జైల్‌ భరో’ను జయప్రదం చేయాలి
బైక్‌ ర్యాలీని ప్రారంభిస్తున్న రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు

ఆలూరు రూరల్‌, ఆగస్టు 9 (ఆంధ్ర జ్యోతి): కార్మికులు, కర్షకులు, రైతాంగం ఎ దుర్కొంటున్న సమ స్యలను పరిష్కరిం చాలని నేడు చేపట్టి న జైల్‌భరో కార్యక్ర మాన్ని జయప్రదం చే యాలని ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం నాయకులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి హనుమం తు మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీ ఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాక భూపేష్‌, సీపీఐ మండల కార్యదర్శి ఎస్‌.ఎ్‌స.బాషా, నాయకులు చేపలగోపాల్‌, ఈరన్న, మైనా, మహేష్‌, ఈశ్వర్‌గౌడ్‌, శీనప్ప, బాలన్న, అయూబ్‌, మహమ్మద్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2026 | 11:35 PM