సీబీఐ దర్యాప్తునకు మాదిగ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ డిమాండ్
ABN , Publish Date - Jun 19 , 2026 | 04:49 AM
విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం, ఇన్స్పెక్టర్ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సెల్ఫీ వీడియో చేసిన పెరుగుపోగు కాంత్రికుమార్ మృతి ఘటనలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని..
అమరావతి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం, ఇన్స్పెక్టర్ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సెల్ఫీ వీడియో చేసిన పెరుగుపోగు కాంత్రికుమార్ మృతి ఘటనలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని మాదిగ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ డిమాండ్ చేసింది. ఈ రెండు ఘటనలపై ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో నిజానిజాలు వెలుగులోకి రావాలంటే వెంటనే సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆ సంస్థ చైర్మన్ ఎ.వి.పటేల్ గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ మృతదేహాన్ని వెలికితీసి మళ్లీ పోస్ట్మార్టం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రెండు ఘటనల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడ పోలీసు కమిషనర్ సహా సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.