సీఎస్ ఓఎస్డీగా ఎం.శ్రీనివాసరావు
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:49 AM
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఓఎస్డీగా జాయింట్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు నియమితులయ్యారు.
అమరావతి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఓఎస్డీగా జాయింట్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జలవనరుల శాఖలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న ఆయనను సీఎస్ ఓఎస్డీగా నియమించారు. మొన్నటి వరకూ ఆ బాధ్యతలు నిర్వహించిన ఫలచంద్రరావును ప్రభుత్వం రెండు రోజుల క్రితం బదిలీ చేసింది.