‘కల్తీ’పై పశ్చాత్తాపం లేదు: ఎల్వీ సుబ్రహ్మణ్యం
ABN , Publish Date - Mar 19 , 2026 | 05:55 AM
కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఎవ రికీ పశ్చాత్తాపం లేదని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు.
విజయనగరం కల్చరల్, మార్చి 18(ఆంధ్రజ్యోతి): కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఎవ రికీ పశ్చాత్తాపం లేదని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరంలోని శంకర మఠంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్వీ మాట్లాడుతూ... ‘టీటీడీ లడ్డూ కల్తీ వ్యవహారంలో జరిగిన పొరపాట్లను ఒప్పుకోకపోగా, వాదనలకు దిగుతున్నారు. అధర్మ మార్గంలో నడిచే వారికి శిక్ష తప్పదు’ అని హెచ్చరించారు.