Share News

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత

ABN , Publish Date - Mar 22 , 2026 | 04:03 AM

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ పిలుపునిచ్చారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత

  • నక్షత్ర వనాన్ని సందర్శించిన జస్టిస్‌ కృష్ణమోహన్‌

చిలకలూరిపేట, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ పిలుపునిచ్చారు. శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలోని నక్షత్ర వనాన్ని ఆయన తన సతీమణితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా నక్షత్ర వనంలో ఆయన మొక్కలు నాటారు. పచ్చని ప్రకృతి మధ్య గడపడం వల్ల కలిగే ఉత్సాహం వెలకట్టలేనిదన్నారు. పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా మనం నేడు నాటే ప్రతి మొక్క భావితరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించే నిధిలా మారుతుందని పేర్కొన్నారు.

Updated Date - Mar 22 , 2026 | 04:03 AM