జగన్ కుట్రలకు చెక్ పెట్టేందుకే అమరావతికి చట్టబద్ధత: బాలకోటయ్య
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:49 AM
రాజధాని అమరావతిపై జగన్ చేస్తున్న కుట్రలకు చెక్ పెట్టేందుకే అమరావతికి చట్టబద్ధ హోదా తీసుకొస్తున్నామని సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య అన్నారు.
అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిపై జగన్ చేస్తున్న కుట్రలకు చెక్ పెట్టేందుకే అమరావతికి చట్టబద్ధ హోదా తీసుకొస్తున్నామని సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అమరావతిపై జగన్ తొలి నుంచీ విషం చిమ్ముతున్నారు. జగన్లాంటి దుర్మార్గులు చేస్తున్న కుట్రల నుంచి రక్షించేందుకే అమరావతికి చట్టబద్ధ హోదా తీసుకొస్తున్నాం. అమరావతి నిర్మాణాల ఖర్చులపైనా జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. చదరపు గజానికి రూ.5 నుంచి రూ.6 వేలు ఖర్చు చేస్తుంటే జగన్ మాత్రం రూ.13 వేలు ఖర్చు చేస్తున్న ట్లు దుష్ప్రచారం చేస్తున్నారు’ అని బాలకోటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.