Share News

20 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రం

ABN , Publish Date - Feb 26 , 2026 | 04:57 AM

సోమవారం నిర్వహించిన ఇంటర్‌ ఫస్టియర్‌ ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పరీక్షకు ప్రశ్నపత్రాన్ని 20 నిమిషాలు ఆలస్యంగా ఇచ్చారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపించారు.

20 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రం

  • విద్యార్థులు, తల్లిదండ్రుల ఆరోపణ.. ఇంటర్‌ పరీక్ష కేంద్రం వద్ద ఆందోళన

  • కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఘటన

ఆదోని అగ్రికల్చర్‌, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): సోమవారం నిర్వహించిన ఇంటర్‌ ఫస్టియర్‌ ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పరీక్షకు ప్రశ్నపత్రాన్ని 20 నిమిషాలు ఆలస్యంగా ఇచ్చారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపించారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఎస్‌కేడీ కాలనీలో ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్‌ పరీక్ష కేంద్రం వద్ద ఈ విషయమై బుధవారం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. పరీక్ష కేంద్రం ఎగ్జామినేషన్‌ చీఫ్‌, ఎగ్జామినేషన్‌ డిపార్ట్‌మెంటల్‌ అధికారులను, సిబ్బందిని నిలదీశారు. కొద్దిసేపు వాగ్వాదం జరగడంతో రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ రామ్‌నాథ్‌ అక్కడ చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ విషయంపై ఇంటర్మీడియట్‌ ఆర్‌ఐవో లాలప్పను వివరణ కోరగా.. తల్లిదండ్రుల ఫిర్యాదులు అందాయని, సీసీటీవీ పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Feb 26 , 2026 | 04:58 AM