కూటమి పాలన ఎలా ఉంది?
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:50 PM
రాష్ట్రంలో కూటమి పాలన ఎలా ఉంది.. వర్షాలు బాగా వస్తున్నాయా.. గత ఏడాది పంటలు ఎలా పండాయి... ఆరోగ్యాలు ఎలా ఉన్నాయంటూ ఎమ్మెల్యే పార్థసారథి ఓ హోటల్లో టీ తాగుతున్న గ్రామ రైతులతో చిట్చాట్ చేశారు.
- రైతులతో ఎమ్మెల్యే పార్థసారథి ముచ్చట్లు
ఆదోని రూరల్, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కూటమి పాలన ఎలా ఉంది.. వర్షాలు బాగా వస్తున్నాయా.. గత ఏడాది పంటలు ఎలా పండాయి... ఆరోగ్యాలు ఎలా ఉన్నాయంటూ ఎమ్మెల్యే పార్థసారథి ఓ హోటల్లో టీ తాగుతున్న గ్రామ రైతులతో చిట్చాట్ చేశారు. ప్రజల కోసం పార్థసారథి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆదోని మండలం నాగలాపురం గ్రామంలో ఎమ్మెల్యే, పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో ఓ హోటల్లో కూర్చొని ముచ్చటించారు. గత ఏడాది వర్షాలు బాగా వచ్చాయని, ఈ ఏడాది కూడా వర్షాలు వస్తే బాగుంటుందని , కూటమి ప్రభుత్వం బాగా పని చేస్తోందని రైతులు సమాధానం ఇచ్చారు. కొత్త పింఛన్లు ఇస్తే బాగుండేదన్నారు. ట్యూషన పిల్లలతో కొద్దిసేపు గడిపారు. అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొందరు పింఛన్లు కావాలని, మరికొందరు పాత ఇండ్లకు బిల్లులు రాలేదని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సమస్యను నోట్ చేసుకుంటున్నానని, అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లేష్, లింగన్న, రామలింగ, నరసప్ప, నరసింహులు, బీజేపీ నాయకులు రాఘవేంద్ర, నాగరాజు, వీరేష్, ఉరుకుందు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.