7న విశాఖ డెయిరీ అక్రమాలపై విచారణ
ABN , Publish Date - Jul 04 , 2026 | 04:46 AM
విశాఖ డెయిరీపై వచ్చిన అవినీతి, అక్రమాల ఆరోపణలపై విచారణ జరిపేందుకు 7న ఉదయం 11గంటలకు..
అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యోతి): విశాఖ డెయిరీపై వచ్చిన అవినీతి, అక్రమాల ఆరోపణలపై విచారణ జరిపేందుకు 7న ఉదయం 11గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో ప్రత్యేక హౌస్ కమిటీ సమావేశం జరుగుతుందని శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర తెలిపారు. వాస్తవానికి గత నెల 29న ఈ సమావేశం జరగాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడి, ఈనెల 7న జరుపుతున్నట్లు తెలిపారు.