చరిత్రలో స్థానం: హోంమంత్రి అనిత
ABN , Publish Date - Mar 29 , 2026 | 04:34 AM
అమరావతి ఉద్యమంలో మహిళా రైతుల పాత్ర చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమరావతి ఉద్యమంలో మహిళా రైతుల పాత్ర చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న గర్భిణులు, చంటిపిల్లలు, ముసలి అవ్వలను సైతం వదిలిపెట్టకుండా నాటి వైసీపీ ప్రభుత్వం పోలీసులతో కొట్టించి, బూటు కాళ్లతో పొట్టపై తన్నించి చిత్రహింసలకు గురి చేసిందన్నారు. ఉద్యమంలో పాల్గొన్న మహిళల చీరలపైనా వైసీపీనేతలు అసభ్యంగా మాట్లాడారని గుర్తు చేశారు.