ఎస్ఐ పదోన్నతులపై హెచ్సీ సంఘం హర్షం
ABN , Publish Date - Mar 14 , 2026 | 05:07 AM
ప్రభుత్వం 300 మంది ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుళ్లకు ఏఆర్ ఎస్ఐలుగా పదోన్నతులు కల్పించడంపై ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుళ్ల అసోసియేషన్ నాయకుడు ఆర్కే గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
అమరావతి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం 300 మంది ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుళ్లకు ఏఆర్ ఎస్ఐలుగా పదోన్నతులు కల్పించడంపై ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుళ్ల అసోసియేషన్ నాయకుడు ఆర్కే గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్కు ధన్యవాదాలు తెలిపారు. యువగళంలో లోకేశ్కు ఇచ్చిన మాట ప్రకారం 300 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లకు ప్రయోజనాలు దక్కుతాయన్నారు.