క్రికెట్ టోర్నీ విజేత గుత్తి ఆర్డీటీ జట్టు
ABN , Publish Date - Jan 21 , 2026 | 11:43 PM
గుత్తిఆర్ఎస్ రైల్వే ఇనిస్టిట్యూట్ మైదానంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బుధవారంతో ముగిసింది.
గుత్తి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): గుత్తిఆర్ఎస్ రైల్వే ఇనిస్టిట్యూట్ మైదానంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బుధవారంతో ముగిసింది. ఫైనల్ మ్యాచలో గుత్తిఆర్డీటీ జట్టు గుంతకల్లు ఏసీఏ జట్టుపై విజయం సాధించింది. విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోచ మహేశ్వర్, నిర్వాహకులు శ్రీనివాసులు, సీనియర్ క్రికెట్ క్రీడాకారులు రఘు, ఇదుర్బాష, చిన్నబాబు పాల్గొన్నారు.