మే 23 నుంచి గుంటూరులో ప్రగతిశీల మహిళా సంఘం 9వ రాష్ట్ర మహాసభలు
ABN , Publish Date - Mar 22 , 2026 | 03:57 AM
ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) 9వ రాష్ట్ర మహాసభలు మే 23, 24 తేదీల్లో గుంటూరులో...
గుంటూరు(తూర్పు), మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) 9వ రాష్ట్ర మహాసభలు మే 23, 24 తేదీల్లో గుంటూరులో నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పి.లక్ష్మి తెలిపారు. శనివారం గుంటూరు యూటీఎఫ్ కార్యాలయంలో ఆహ్వాన సంఘ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీవోడబ్ల్యూ సాగిస్తున్న పోరాటాలను సమీక్షించుకొని, భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోవడానికి ఈ మహాసభలు దోహదపడుతాయన్నారు.