గుంతకల్లు-బళ్లారి రైల్వే లైన్లతో సరికొత్త ఆర్థిక అవకాశాలు: సీఎం
ABN , Publish Date - Jul 26 , 2026 | 05:05 AM
గుంతకల్లు-బళ్లారి మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్కు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): గుంతకల్లు-బళ్లారి మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్కు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఎక్స్లో పోస్టు చేశారు. ‘రూ.1264 కోట్లతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. మొత్తం పెట్టుబడిలో రూ.600 కోట్లు ఏపీలోనే ఖర్చు చేస్తున్నారు. తూర్పు, పడమర రైల్వే కారిడార్ మరింత బలోపేతమయ్యేందుకు ఈ రైల్వే లైన్లు ఉపయోగపడతాయి. ఈ రైల్వే లైన్ల వల్ల రాయలసీమ, ఉత్తర కర్ణాటక, గోవా ప్రాంతాల మధ్య కనెక్టివిటీ గణనీయంగా పెరుగుతుంది. కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులకు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తూ ఏపీ అభివృద్ధికి మద్దతిస్తున్న కేంద్రానికి ధన్యవాదాలు’ అని సీఎం పేర్కొన్నారు.