గవర్నర్ హోలీ శుభాకాంక్షలు
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:25 AM
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హోలీ పండుగ సందర్భంగా గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హోలీ పండుగ సందర్భంగా గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేర కు లోక్భవన్ ఒక ప్రకటన జారీ చేసింది. ‘హోలీ పండుగ ప్రజల్లో సోదర, సద్భావనలను బలోపేతం చేస్తూ, సమాజంలో శాంతి, శ్రేయస్సును పెంపొందించే రంగురంగుల ఉత్సాహభరితమైన పండుగ. హోలీ పండుగ స్ఫూర్తి అన్ని అడ్డంకులను అధిగమించి సామాజిక నిర్మాణాన్ని బలోపేతం చేస్తుంది’ అని గవర్నర్ పేర్కొన్నారు.