గోరంట్ల మాధవ్ కేసు విచారణ 16కువాయిదా
ABN , Publish Date - Feb 17 , 2026 | 04:32 AM
హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై సైబర్ క్రైం పోలీసులు నమోదు చేసిన కేసు విచారణను విజయవాడ పోక్సో కోర్టు...
విజయవాడ, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై సైబర్ క్రైం పోలీసులు నమోదు చేసిన కేసు విచారణను విజయవాడ పోక్సో కోర్టు వచ్చే నెల 16కి వాయిదా వేసింది. కర్నూలులో బాలికపై అత్యాచారం ఘటనలో ఆమె పేరు, ఫొటోలను మీడియా సమావేశంలో వెల్లడించారు. దీనిపై మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గతేడాది చేసిన ఫిర్యాదుపై ఆయనపై కేసు నమోదైంది.