Share News

బంగారం వ్యాపారి కుచ్చుటోపీ?

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:08 AM

ఎమ్మిగనూరు పట్టణంలో ఓ బంగారం వ్యాపారి కోటి రూపాయలకు పైగానే కుచ్చుటోపీ పెట్టినట్లు సమాచారం.

బంగారం వ్యాపారి కుచ్చుటోపీ?

ఎమ్మిగనూరు/ టౌన, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు పట్టణంలో ఓ బంగారం వ్యాపారి కోటి రూపాయలకు పైగానే కుచ్చుటోపీ పెట్టినట్లు సమాచారం. పట్టణం, గ్రామాలకు చెందిన వారు ఆభరాణాలు తయారీ చేసేందుకు ఇచ్చిన కోటి రూపాయలకు పైగా విలువ చేసే బంగారాన్ని తిరిగి చెల్లించకుండా ముఖం చాటేసినట్లు తెలుస్తోంది. నగలు తయారు చేసేందుకు బంగారు ఇచ్చిన బాధితులు సదరు బంగారు వ్యాపారి దుకాణం చూట్టు తిరుగుతూ వచ్చారు. బంగారు వ్యాపారి కొన్ని రోజులు నుంచి దుఖాణాన్ని తెరవకపోవడంతో తమకు కుచ్చుటోపీ పెట్టాడని భాదితులు గ్రహించారు. దీంతో శుక్రవారం పట్టణ పోలీస్‌ స్టేషనను ఆశ్రయించారు. బంగారు వ్యాపారి చేతిలో పట్టణానికి చెందిన కొంత మంది బంగారం, నగలు విక్రయించే వ్యాపారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పట్టణ ఎస్‌ఐ మధుసూదన రెడ్డిని వివరణ కోరగా భాదితులు స్టేషనకు వ చ్చారని, పూర్తిగా ఆధారాలతో వస్తే కేసు నమోదు చేస్తామని వారికి చెప్పినట్లు తెలిపారు.

Updated Date - Feb 28 , 2026 | 12:08 AM