తిరుమలలో బంగారు ‘కొండ’
ABN , Publish Date - May 21 , 2026 | 04:18 AM
తిరుమల శ్రీవారిని బుధవారం గోల్డ్మేన్ కొండ విజయ్ కుమార్ దర్శించుకున్నారు. తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడైన విజయ్కుమార్ శ్రీవారికి పరమభక్తుడు.
తిరుమల, మే 20 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని బుధవారం గోల్డ్మేన్ కొండ విజయ్ కుమార్ దర్శించుకున్నారు. తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడైన విజయ్కుమార్ శ్రీవారికి పరమభక్తుడు. భారీ పరిమాణంలో ఉన్న బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారి దర్శనానికి రావడం ఆయనకు అలవాటు. ఇందులో భాగంగా బుధవారం మూడు కిలోల బంగారు ఆభరణాలను ధరించి విజయ్కుమార్ తిరుమలేశుడిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపలకు వచ్చిన ఆయనను పలువురు భక్తులు ఆసక్తిగా చూశారు.