Share News

Girisha Appointment: సెంట్రల్‌ సిల్క్‌ బోర్డు డైరెక్టర్‌గా గిరిషా

ABN , Publish Date - Jan 06 , 2026 | 05:45 AM

ఏపీఎంఎస్ఐడీసీ (ఆంధప్రదేశ్‌ మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌) ఎండీ పీఎస్‌ గిరిషా కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు.

Girisha Appointment: సెంట్రల్‌ సిల్క్‌ బోర్డు డైరెక్టర్‌గా గిరిషా

అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ఏపీఎంఎస్ఐడీసీ (ఆంధప్రదేశ్‌ మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌) ఎండీ పీఎస్‌ గిరిషా కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. బెంగుళూరులోని సెంట్రల్‌ సిల్క్‌ బోర్డు డైరెక్టర్‌గా కేంద్రం ఆయనకు పోస్టింగ్‌ ఇచ్చింది. ఈ మేరకు డీవోపీటీ డైరెక్టర్‌ ఎ.కన్మణి జోయ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2012 బ్యాచ్‌కు చెందిన గిరిషా కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు చేసుకున్న దరఖాస్తుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్‌వోసీ ఇవ్వడంతో కేంద్రం ఆయనను సెంట్రల్‌ సిల్క్‌ బోర్డు డైరెక్టర్‌గా నియమించింది.

Updated Date - Jan 06 , 2026 | 05:45 AM