గాదె వెంకటరెడ్డికి కన్నీటి వీడ్కోలు
ABN , Publish Date - Jun 01 , 2026 | 05:56 AM
వయోభారం, అనారోగ్య సమస్యలతో మృతి చెందిన మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అంత్యక్రియలు ఆదివారం ఉదయం ఆయన స్వగ్రామమైన బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పావులూరులో జరిగాయి.
పావులూరులో ముగిసిన అంత్యక్రియలు
ఇంకొల్లు, మే 31 (ఆంధ్రజ్యోతి): వయోభారం, అనారోగ్య సమస్యలతో మృతి చెందిన మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అంత్యక్రియలు ఆదివారం ఉదయం ఆయన స్వగ్రామమైన బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పావులూరులో జరిగాయి. రాజకీయ నాయకులు, అభిమానులు, బంధుమిత్రులు, గ్రామస్థులు పెద్దసంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు. సొంత వ్యవసాయ భూమిలో వెంకటరెడ్డికి కుమారులు గాదె మధుసూదన్రెడ్డి, సుధాకరరెడ్డి, శ్రీకాంత్రెడ్డి దహన సంస్కారాలు నిర్వహించారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పర్చూరు ఏఎంసీ చైర్మన్ గుంజి వెంకట్రావు తదితరులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.