శేషాచల కొండల్లో కార్చిచ్చు
ABN , Publish Date - Apr 27 , 2026 | 06:22 AM
శేషాచల కొండల్లో కార్చిచ్చు రేగింది.తిరుపతి శివారు ప్రాంతమైన జీవకోన పైభాగంలోని అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 3గంటల..
తిరుపతి(కపిలతీర్థం),ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): శేషాచల కొండల్లో కార్చిచ్చు రేగింది.తిరుపతి శివారు ప్రాంతమైన జీవకోన పైభాగంలోని అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఆ అగ్నిజ్వాలలు కిలోమీటర్లమేర వ్యాపించడంతో అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.అయితే రాత్రి 10గంటలకు కూడా మంటలు అదుపులోకి రాలేదు.రాత్రికే మంటలను అదుపులోకి తీసుకొస్తామని తిరుపతి రేంజ్ ఆఫీసర్ సుదర్శన్రెడ్డి చెప్పారు.మంటలు ఎలా వ్యాపించాయనేది తెలియాల్సి ఉందన్నారు.